చలవపేటలో బొమ్మిడి నాయకర్ పాదయాత్ర

  • జనంలోకి జనసేన 20వ రోజు

నరసాపురం: జనంలోకి జనసేన కార్యక్రమంలో భాగంగా 20వ రోజు కార్యక్రమంలో భాగంగా నరసాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి, పీఏసీ సభ్యులు మరియు రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ ఛైర్మెన్ బొమ్మిడి నాయకర్ నరసాపురం పట్టణం 2వ వార్డు చలవపేటలో ఇంటింటికీ తిరిగి జనసేన పార్టీ సిద్ధాంతాలు తెలియజేసి అక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని వారికి జనసేన పార్టీ తరపున భరోసా ఇచ్చారు. ఈ వార్డులో ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీటి వ్యవస్థ సరిగ్గా లేకపోవడం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిపారని నాయకర్ తెలియజేసారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కోటిపల్లి వెంకటేశ్వరరావు, ఆకన చంద్రశేఖర్ కొల్లాటి గోపికృష్ణ, అంబటి అరుణ, వాతాడి కనకరాజు, బందెల రవీంద్ర, నిప్పులేటి తారకరామారావు, తోట అరుణ, కొప్పాడి కృష్ణవేణి, పోలిశెట్టి సాంబ, వనమాల శ్రీను, కునపరెడ్డి రామకృష్ణ, ఆయితం చిన్ని, కటకం శెట్టి సాయి, పులపర్తి రాంబాబు, గ్రంధి నాని, దూసనపూడి సత్యనారాయణ, ఓలేటి దేవి, కొండేటి తాతాజీ, వాటాల రామారావు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, జనసైనికులు, వీరమహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.