అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న బొంతు రాజేశ్వరరావు

రాజోలు నియోజకవర్గం: పరిరక్షణ చైతన్య సమితి ఆధ్వర్యంలో త్రాగునీరు-సాగునీరు సమస్యపై అఖిలపక్ష రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మలికిపురం మండలం మలికిపురం పూలే అంబేద్కర్ భవనంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో జనసేన నాయకులు బొంతు రాజేశ్వరరావు మాట్లాడుతూ.. తీర ప్రాంత గ్రామాలకు నేటికీ సరైన త్రాగునీటి సదుపాయాలు లేవన్నారు. ఈ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజోలు నియోజకవర్గం ముఖ్య నాయకులు పాల్గొన్నారు.