బుగ్గానిపల్లె గ్రామ మెగా అభిమానులు జనసైనికులుగా మారడం సంతోషం: చింతా సురేష్ బాబు

కర్నూలు జిల్లా, డోన్ నియోజకవర్గం బేతంచెర్ల మండలం బుగ్గానిపల్లె గ్రామ మెగా అభిమానులు జనసైనికులుగా మారుతు కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు ఆధ్వర్యంలో జనసేనలో చేరారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ… ఒక గ్రామానికి చెందిన 40మంది మెగా అభిమానులు జనసైనికులుగా మారడం సంతోషంగా ఉందని కర్నూలు జిల్లాలో జనసేన పార్టీ మునుముందు చేపట్టబోయే కార్యక్రమాలను గ్రామస్థాయిలో ముందుకు తీసుకెళ్లాలి అని పార్టీ బలోపేతమే ముఖ్యం అని 2024 లో జనసేన గెలుపే ధ్యేయంగా పని చేసుకుంటూ ముందుకు పోవాలని, పార్టీ కోసం పని చేసే జనసైనోకులకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పార్టీ కోసం పని చేసేటప్పుడు ఇతర పార్టీల నుంచి మీకు ఎటువంటి ఇబ్బందీ కలిగిన క్షణాల్లో మీ ముందు ఉంటామని హామీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ మన కోసం గత నెలలో క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం మొదలు పెట్టారని సమయం సరిపోక ఈ కార్యక్రమాని ఈ నెల 27వ తేది వరకు పొడిగింపు చేశారని ఇంకా సభ్యత్వం చేసుకోని వారు తప్పకుండా చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బేతంచెర్ల మండల జనసైనికుడు పరమేష్, బుగ్గానిపల్లె జనసైనికులు గుర్రప్ప, బాల సుబ్బయ్య, చరణ్, ఎం.రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.