బాబా సాహెబ్ అంబేద్కర్ కు ఘన నివాళులు అర్పించిన సిజి రాజశేఖర్

పత్తికొండ: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయనకు జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గం నాయకులు ఘననివాళులు అర్పించారు. ఈ సందర్బంగా జనసేన పార్టీ పత్తికొండ నియోజకవర్గ నాయకుడు సిజి రాజశేఖర్ మాట్లాడుతూ ప్రజలకు శ్రీ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆర్ధిక వేత్త, న్యాయ కోవిదుడు, అంటరానితనం, వివక్షలపై అలుపెరుగని పోరాటం చేసిన మహనీయులు, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డా. బి.ఆర్. అంబేద్కర్ 132 జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ.. ఆ మహనీయుని ఆశయ సాధనకై పునరంకితమవుదామని తెలియజేసి కుల, మత, ప్రాంతాలకు అతీతంగా రాజ్యాంగ ఫలాలు అందాలనే ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఏ ఒక కులానికో అంబేద్కర్ పరిమితం కాదని జనసేన పార్టీ తరపున తెలియజేస్తున్నాం అన్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు కొత్తపల్లి అజయ్, నూరు భాష, ఎర్రి స్వామి, సుధాకర్, ధనుంజయ్, నాగభూషణం, రాజశేఖర్, నాగరాజు, సాయి, అభిరామ్, సౌఖత్, మరియు తదితరులు పాల్గొన్నారు.