వినుకొండ జనసేన ఆధ్వర్యంలో చలివేంద్రం

వినుకొండ నియోజకవర్గం, వినుకొండ పట్టణంలో శ్రీమతి డొక్కా సీతమ్మ స్ఫూర్తితో వినుకొండ నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు కొంజేటి నాగశ్రీను రాయల్ ఆధ్వర్యంలో ప్రజల సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన మంచి నీటి చలివేంద్రాలను ముఖ్యఅతిథిగా గుంటూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొని ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు చెయ్యడంలో ముందు ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రతి జనసైనికుడు పార్టీ బలోపేతానికి కృషి చెయ్యాలి అని కోరారు. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నాగశ్రీను రాయల్ ని ప్రతేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో శావల్యాపురం మండల అధ్యక్షులు అడపాల అనిల్, న్యాయవాది నక్కా రమణ, ఉపాధ్యక్షులు ఎటుకూరి అయ్యప్ప, నూజండ్ల మండల ఉపాధ్యక్షులు పసుపులేటి రాజిబాబు, మంచాల వెంకటేష్, పట్టణ మైనార్టీ నాయకులు పఠాన్ ఈసుబ్, కామిశెట్టి కిషోర్ వీరమహిళ యాదల సునీత, పార్టీ సీనియర్ నాయకులు ఆసా మనోహర్, రామిశెట్టి అశోక్, తుమ్మా అనిల్, మంచాల వెంకీ, తిరుమలశెట్టి శ్రీను, పారెళ్ల అభిమన్యు, రావుల నాగరాజు, యాదాల జపాన్, కోలా రామంజి, వేముల గోపి, బండారు శ్యామ్, ఆకాష్, తోటి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.