చలో మచిలీపట్నం పోస్టర్లను ఆవిష్కరించిన షేక్ మహబూబ్ మస్తాన్

ఆత్మకూరు నియోజకవర్గం, జనసేన పార్టీ నాయకులు అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహబూబ్ మస్తాన్ ఆధ్వర్యంలో సోమవారం పార్టీ కార్యాలయంలో చలో మచిలీపట్నం పోస్టర్లను ఆవిష్కరించారు. మార్చి 14వ తారీకున జరిగే పదవ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం మచిలీపట్నంలో జరిగే బహిరంగ సభకు ప్రతి జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు, అభిమానులు ఆవిర్భవ సభకు హాజరై విజయవంతం చేయాలని, ఆత్మకూరు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు అభిమానులు భారీగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇవ్వడం జరిగింది. ఈ పదవ ఆవిర్భాసభకు సభకు దిగ్విజయ సభగా నామకరణం చేయడం జరిగింది. ఈ సభలో రాష్ట్ర రాజకీయలో జరగబోయే పెను మార్పులను రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఏ విధంగా ప్రజల్లో ముందుకెళ్లాలన్నా విషయంపై చర్చించడం జరుగుతుందన్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిపే లక్ష్యంగా ముందుకు సాగుతారు అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎం పెంచలయ్య, మండల సంయుక్త కార్యదర్శలు హరి కృష్ణ, ఖాజా మస్తాన్ జన సైనికులు మహేంద్ర, నరసింహ అస్లం, సుభాని పాల్గొనడం జరిగింది.