చీరాల జనసైనికులను అభినందించిన చిల్లపల్లి

  • పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చిన చిల్లపల్లి శ్రీనివాసరావు

చీరాల నియోజకవర్గం: చీరాల జనసైనికులు ప్రతి చేనేత కుటుంబాలను కలిసి వారి సమస్యలను తెలుసుకుంటూ పవనన్న చేనేత బాట కార్యక్రమం మొదలుపెట్టి శనివారానికి 365 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆదివారం జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో కలిసి, గడపగడపకు తిరిగి తెలుసుకున్న చేనేత కుటుంబాలు పడుతున్న సమస్యలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. పవనన్న చేనేత బాట కార్యక్రమం మొదలుపెట్టి దాదాపుగా 365 రోజులు పూర్తయిన సందర్భంగా ఈరోజు మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో పవనన్న చేనేత బాట కార్యక్రమం చేస్తున్న చీరాల జనసైనికులు కలవడం జరిగిందని, జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతి గడపగడపకు తిరిగి, జనసేన సిద్ధాంతాలు ప్రజల్లోకి తీసుకెళ్తున్న చీరాల జనసైనికులను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను అని, ఇలాగే రానున్న రోజుల్లో కూడా పార్టీ బలోపేతానికి కృషిచేసి జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవిధంగా కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు.