రాజశేఖర్ అనారోగ్యంపై స్పందించిన చిరు

సీనియర్ నటుడు రాజశేఖర్ కరోనా బారినపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని ఆయన కూతురు శివాత్మిక ట్విట్ చేసిన నేపథ్యంలో ఆందోళన మొదలైంది.

తాజాగా రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘డియర్ శివాత్మిక .. మీ నాన్న, నా స్నేహితుడు రాజశేఖర్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నా. ధైర్యంగా ఉండండి. అందరి ప్రార్ధనలతో రాజశేఖర్ త్వరగా కోలుకుంటారు. మీ కుటుంబం కోసం ప్రార్ధిస్తున్నాను’ అని చిరు ట్విట్ చేసారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం చిరంజీవి రాజశేఖర్ కోసం ఓ ప్రత్యేక వైద్యబృందాన్ని పంపారని తెలుస్తుంది. తన స్నేహితుడి కోసం చిరు ఓ వైద్య బృందాన్ని పంపి చికిత్స చేయిస్తున్నారట. ఎప్పటికప్పుడు రాజశేఖర్ ఆరోగ్య పరిస్థితిపై చిరు ఆరా తీస్తున్నారట.