అగ్నిప్రమాద బాదితులను ఆదుకున్న చుండూరు జనసేన నాయకులు

భట్టిప్రోలు రైలుపేటలో అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన బళ్లారి శ్రీను కుటుంబ సభ్యులకు చుండూరు మండలం జనసేన నాయకులు పోకల శ్రీనివాసరావు తక్షణ ఆర్ధిక సహాయంగా 5000 రూపాయలు మరియు బాధితులకు నూతన వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో పోకల గోపి, కోడె భాస్కర్, అప్పికట్ల శ్రీహరి, సుదా రాధాకృష్ణ మూర్తి పాల్గొన్నారు.