వైసిపి, జనసేన నేతలు మధ్య ఘర్షణ

  • తిరుపతి వెంకటరెడ్డి కాలనీలో ఉద్రిక్తత

తిరుపతి, జనసేన నేతలు తిరుపతి వెంకటరెడ్డి కాలనీలో పర్యటించిన నేపథ్యంలో మా ఏరియాలో జనసేన పర్యటించకూడదు అని అధికార పార్టీ బెదిరించడంతో వైసీపీ నాయకులు, జనసేన వీర మహిళల మద్య పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం నెలకొంది. ఇలాంటి సంఘటనలను తీవ్రంగా ఖండిస్తూ జనసేన నేతలు ఈస్ట్ పోలీస్ స్టేషన్ నందు కేసును నమోదు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు జనసైనికులు పాల్గొన్నారు.