రా సైనికా జనసేన పిలుస్తుంది కదలి రా!

  • కాకినాడ రూరల్ నియోజకవర్గం క్రియా శీలక సభ్యులు, ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్

కాకినాడ రూరల్ నియోజకవర్గం: కాకినాడ రూరల్ నియోజకవర్గం క్రియా శీలక సభ్యులు, ఐటీ విభాగం సభ్యులు అనిల్ కుమార్ మాట్లాడుతూ జనసేన పార్టీ జిల్లా నాయకులకు అలాగే మండల కమిటీ నాయకులకు, అలాగే గ్రామ కమిటీ సభ్యులకు జనసేన వీరమహిళలకు జనసేన శ్రేణులకు, జనసేన మద్దతు దారులకు కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరు శతకోటి వందనాలు తెలియజేస్తున్నా.. మన సంఖ్య బలం నిరూపించుకోనే రోజు వచ్చింది. రా సైనిక కదలి రా మన బానిసత్వంగా బ్రతక వలసిన రోజులు పోయాయి జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేసి, మన పిల్లల భవిష్యత్తు మెరుగు పడాలంటే మనం బైటకి రావాల్సిందే బైటకి వచ్చి సామాన్యుల బలం చుపించుకునే రోజు ఆసన్నమైంది.. మన రాష్ట్రాన్ని కాపాడు కోవలసిన బాధ్యత మన మీద ఎంతైనా ఉంది, బైటికి వచ్చి మన ప్రియతమ నాయకులు, దమ్మున నాయకులు, కష్టాల్లో ఉన్న ప్రజలకు, అండగా ఉంటూ బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిన పీఏసీ సభ్యులు పంతం నానాజీని అసెంబ్లీ పంపించి మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకునే అవకాశం ఒక్క పంతం నానాజీ గారితోనే సాధ్యం.. ఆయన గెలుపుకు ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అశయాలకు సిద్ధాంతాలు కి అండగా నిలబడదాం, మన పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మన అడుగులు వుండాలి… కుళ్లిపోయిన ఈ రాజకీయ వ్యవస్థను తరిమి తరిమి కొడదాం మనకి ఉద్యోగ అవకాశాలు రావాలన్న, రైతులకు న్యాయం జరగాలన్న, గ్రామ అభివృద్ది జరగాలన్న ప్రతి ఒక్కరు ముందుకు రావాల్సిన సమయం ఇది… రబ్బరు చెప్పులు వేసుకున్న వానితో రాజకీయం చేయిపిస్తాను అన్న ఏకైన నాయకుడు మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు అలాంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వితే మన బ్రతుకులు మారతాయి.. దయచేసి ప్రతి ఒక్కరు ఒక కుటుంబం సభ్యులుగా నేను సిద్దం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు గా!!జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెనుకాల కాకినాడ రూరల్ ప్రియతమ నాయకులు శ్రీ పంతం నానాజీ గారి వెనుకాల దన్నుగా నిలబడతాను అని తెలియజేస్తున్నా, అలాగే మన కుటుంబం సభ్యులు కుడా సిద్దమా?? రా సైనికా జనసేన పిలుస్తుంది కదలి రా మర్పుకి శ్రీ కారం చుట్టడానికి ముందుకు రావాలని అనిల్ కుమార్ పిలుపునిచ్చారు.