తేజ్ కు కంగ్రాట్స్ చెప్పిన… పవన్ త్రివిక్రమ్

దేవ కట్ట దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రిపబ్లిక్. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ హీరోయిన్ గా నటించింది. అలాగే రమ్యకృష్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. అక్టోబర్ 1న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకోటం పాటు మంచి వసూళ్లను కూడా సాధిస్తుంది. అయితే ఈ సినిమా సక్సెస్ పై సినీ రాజకీయ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తాజా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిపబ్లిక్ టీం కి స్పెషల్ విషెస్ తెలియజేసారు. ఇద్దరూ కూడా రెండు బొకే లు పంపించి వారికి అభినందనలు తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబందించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.