మర్రాపు సురేష్ కు అభినందనలు

గజపతినగరం నియోజకవర్గం: జనసేన నాయకుడు మర్రాపు సురేష్ కు నియోజకవర్గ సమన్యయకర్తగా అధిష్టానం ప్రకటించిన సందర్భంగా నాలుగు మండలాల జనసైనికులు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొని మర్రాపు సురేష్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2014 నుంచి ఈ నియోజకవర్గంలో ఎంత కష్టపడుతున్నానని పార్టీ గుర్తించినందుకు సంతోషించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పడాల అరుణ, ఆదాడ మోహన్, మిడతాన రవికుమార్, కళింగ పండు, మహేష్, చరణ్, లక్ష్మణ్, సూర్య, అనిల్, అశోక్, సత్యనారాయణ, తదితర నాయకులు, వీరమహిళలు పాల్గొన్నారు.