త్వరలో టిడిపి-జనసేన నియోజకవర్గ స్థాయి సమన్వయం సమావేశాలు

తిరుపతి: టిడిపి, జనసేన పొత్తు నేపధ్యంలో నియోజకవర్గ స్థాయిలో రెండు పార్టీల సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నట్టు జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తెలిపారు. శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో పూతలపట్టు, సత్యవేడు నియోజకవర్గాలకు చెందిన పార్టీ ముఖ్య నాయకులు సమావేశమయ్యారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని కోరారు. టిడిపి నేతలతో కలిసి మెలిసి పొత్తు ధర్మాన్ని పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సత్యవేడు నియోజకవర్గ నాయకులు లావణ్యకుమార్, హేమ కుమార్, ఐరాల మండల అధ్యక్షుడు పురుషోత్తం ప్రధాన కార్యదర్శి తులసి, యువ నాయకుడు వినయ్ మండల ఉపాధ్యక్షుడు చందు, తవణంపల్లి మండల అధ్యక్షుడు శివ, యాదమరి మండల అధ్యక్షుడు కుమార్ తదితరులు పాల్గొన్నారు.