భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్ర

కాకినాడ సిటి: జనసేన పార్టీ కాకినాడ సిటి ఇంచార్జ్ ముత్తా శశిధర్ నాయకత్వంలో భవన నిర్మాణ కార్మికుల భవిష్యత్ హామీ యాత్రా కార్యక్రమం తుమ్మలపల్లి సీతారాం ఆధ్వర్యంలో 44 డివిజన్ మెహర్ నగర్ 2వ వీధి ప్రాంతంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీల ఉమ్మడి నిర్వాహణలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ తప్పులు జరగడం మానవసహజం అనీ కానీ జరిగినది తప్పు అని నలుగురూ చెప్పాకా కూడా మూర్ఖంగా సరిదిద్దుకోని ప్యూఢల్ మనస్తత్వం ఈ జగన్మోహన్ రెడ్డిది అని అన్నారు. నవ్వి పోదురుగని నాకేటి సిగ్గు అన్న చందాన ఇప్పటికీ ఇసుక సరఫరా విధానం టెండరులు వేరే రాష్ట్రం నుండీ నిర్వహిస్తూ తనసొంత మనుషులకు కట్టబెట్టి అక్రమంగా సంపాదించాలని తప్ప కునారిల్లుతోన్న భవన నిర్మాణ రంగాన్ని నిలబెట్టే ఆలోచన ఈ ముఖ్యమంత్రికి రాకపోవడం ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. పైపెచ్చు ఇదివరకు ప్రభుత్వం పేదలకు ఉచిత ఇసుక ఇవ్వడం తప్పు అన్నట్టు చంద్రబాబు నాయుడిపై కేసు పెట్టడం తన నిరంకుశ మనస్తత్వానికి పరాకాస్టగా ప్రజలు భావిస్తున్నారనీ, త్వరలో ఈ వై.సి.పి ప్రభుత్వానికి పరాభవం తప్పదన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ తరపున నున్న సత్యనారాయణ, రావిపాటి వెంకటేశ్వర, శెట్టి జోగిరాజు, తోరం చిరంజీవి, గోప్ఫు సూర్యనారాయణ, తెలుగుదేశం పార్టీ తరపున బోల్లోజు ఉమామహేశ్వర్, కలిదిండి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.