కొత్తకోట వైకుంఠ ఆధ్యర్యంలో క్రియాశీలక సభ్యుత్య కిట్ల పంపిణీ

మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, భామిని మండలం సొలికిరి గ్రామంలో జనసేన నాయకులు కొత్తకోట వైకుంఠ ఆధ్యర్యంలో క్రియాశీలక సభ్యుత్యం కిట్లు పంపిణీ కార్యక్రమం చేయటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మనోగతాన్ని వినిపించడం జరిగింది. అలానే రాబోయే రోజుల్లో క్రియాశీలక సభ్యుల యొక్క బాధ్యతను కుడా తేలియజేయటం జరిగింది. ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రజలకు తేలియజేస్తూ… రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం స్థాపించడానికి క్రియాశీలక సభ్యులు కీలక పాత్ర పోషించాలని సూచించటం జరిగింది. ఈ కార్యక్రమంలో బుజ్జి, రవి, కిషోర్, రంజిత్, ధర్మారావు, వీరమహిళ సుశాన, రుద్రపతి, నవీన్ మరియు జనసైనికులు పాల్గొన్నారు.