మహారాష్ట్ర పోలీస్‌శాఖలో కరోనా విలయం

మహారాష్ట్రలో కరోనా మహమ్మారి కలకలం సృష్టిస్తోంది. అయితే పోలీస్‌శాఖలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 511 మంది పోలీసులకు కరోనా నిర్ధారణకాగా, ఏడుగురు మరణించారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో 16,912 మంది పోలీసులకు కరోనా సోకింది. ఇందులో 3020 యాక్టివ్ కేసులు ఉండగా, 13,719 మంది కోలుకున్నారు. కరోనాతో మొత్తం 173 మంది మృతిచెందారని మహారాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించింది. ఇక రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల్లో 2,21,012 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 636574 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో ఇప్పటివరకు 26276 మంది కరోనాతో మరణించారు.