కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రెండో సారి కరోనా పాజిటివ్

కర్ణాటక సీఎం యడ్యూరప్పకు రెండోసారి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. సీఎం యడ్యూరప్ప శుక్రవారం ఉదయం ఆసుపత్రికి సాధారణ తనిఖీ కోసం వెళ్లిన తరువాత ఆయన్ను రామయ్య ఆసుపత్రిలో చేరాలని వైద్యులు సలహా ఇచ్చారు. రాబోయే ఉపఎన్నికలకు బెలగావిలో ప్రచారం చేస్తున్న కర్ణాటక సీఎం జ్వరంతో బాధపడుతున్నారని, యాంటిజెన్ పరీక్ష కూడా చేయించుకున్నారని, అయితే అప్పుడు నెగిటివ్ అని తేలినట్టు సమాచారం. దీంతో ఆసుపత్రికి వెళ్ళగా మరోసారి టెస్ట్ చేయగా ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది.