మాజీ ప్రధాని దంపతులకు కరోనా.. ఫోన్ చేసి మాట్లాడిన ప్రధాని మోడీ
జేడీఎస్ పార్టీ అధినేత,మాజీ ప్రధానమంత్రి హెచ్డీ దేవెగౌడకు కరోనా పాజటివ్గా తేలింది. ఆయన భార్య చెన్నమ్మకు కూడా కరోనా వైరస్ సోకింది. ఈ విషయాన్ని దేవెగౌడ.. ట్విట్టర్లో తెలిపారు. ప్రస్తుతం ఇరువురు స్వీయ నిర్బంధంలో ఉన్నట్లు దేవెగౌడ పేర్కొన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పార్టీ కార్యకర్తలు, తన క్షేమం కోరేవారు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
కరోనా బారిన పడిన దేవెగౌడ దంపతుల ఆరోగ్య పరిస్థితిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆరా తీశారు. ఫోన్ చేసి వారితో మాట్లాడినట్లు మోడీ ట్వీట్ చేశారు. ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు మోడీ తెలిపారు. మోడీ ఫోన్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ కాసేపటికే దేవెగౌడ ట్వీట్ చేశారు. దేశంలో నేను కోరుకున్న ఏ నగరంలోనైనా, ఏ ఆస్పత్రిలోనైనా చికిత్స చేయించుకోవాలని మోడీ సూచించడం ఆనందకరం. నాకు బెంగళూరులో అంతా బాగుందని, ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తానని ఆయనకు చెప్పా అని దేవెగౌడ ట్వీట్ లో పేర్కొన్నారు.
I am grateful to Prime Minister @narendramodi for calling and enquiring after my health. I am also deeply moved by his offer to get me treated in any hospital of my choice in any city. I assured him that I am being looked after well in Bangalore, but will keep him informed.
— H D Devegowda (@H_D_Devegowda) March 31, 2021