‘క్రాక్’ మేకింగ్ వీడియో
మాస్ మహారాజా రవితేజ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తాజారూపొందుతోన్న చిత్రం ‘క్రాక్’. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కతోన్న ఈ చిత్రం లో శ్రుతి హాసన్ కథా నాయికగా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో పునఃప్రారంభమైంది. రవితేజ, ఇతర నటీనటులపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్తో షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తవుతుంది. సోమవారం ‘క్రాక్’ షూటింగ్కు సంబంధించిన ఒక వర్కింగ్ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో షూటింగ్ సెట్ మొత్తాన్ని ప్రాపర్గా శానిటైజ్ చేయడం, ఎంట్రన్స్లో డిజిన్ఫెక్టెంట్ టన్నెల్ను ఏర్పాటు చేయడం చూపించారు. రవితేజ, గోపీచంద్ మలినేని సహా సెట్లో ఉన్న ప్రతి యూనిట్ మెంబర్ మాస్క్ ధరించి కనిపిస్తున్నారు. కెమెరా ముందుకు వచ్చి నటిస్తున్నప్పుడు మాత్రమే యాక్టర్లు మాస్క్లు తీసేస్తున్నారు.
‘స్టేషన్లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ మోడ్లో పెట్టి దొబ్బిచ్చుకో’ అని తోటి పోలీస్తో రవితేజ గట్టిగా చెబుతున్న లేటెస్ట్ డైలాగ్ సీన్ ఒకదాన్ని ఈ వీడియోలో చూపడం జరిగినది. ఆ డైలాగ్తో రవితేజ క్యారెక్టరైజేషన్ ఏ రీతిలో ఉంటుందో చిత్ర బృందం మనకు హింట్ ఇస్తోంది. అలాగే తమన్ బ్యాగ్రౌండ్ స్కోర్ కథలోని ఇంటెన్సిటీని ఎలివేట్ చేసే రీతిలో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు, మాస్ ఎలిమెంట్స్తో కనిపించిన టీజర్కు సూపర్బ్ రెస్పాన్స్ రావడమే కాకుండా, రవితేజ ఫ్యాన్స్ను, ప్రేక్షకులను అవి అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు వర్కింగ్ వీడియోతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.