ఆర్కే రోజాపై క్రిమినల్ కేసులు నమోదు

మదనపల్లి నియోజవర్గం: జనసేన పార్టీ ఆదేశాల మేరకు వైసీపీ పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి ఆర్కే రోజా సభ్య సమాజం తలదించుకొనేలా స్త్రీలకి చెడ్డ పేరు తెచ్చేలా ప్రతిపక్ష పార్టీ నాయకులను ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ ను వ్యక్తిగతంగా తీవ్ర పదజాలంతో దుర్భాషాలాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలు మనోభావాలు దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. ఈ విషయంగా గురువారం మదనపల్లి వన్ టౌన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కు ఆర్కే రోజా మీద క్రిమినల్ కేసులు నమోదు చేసి చట్ట పరంగా చర్యలు తీసుకొని శిక్షించాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం, టౌన్ ప్రెసిడెంట్ నాయని జగదీష్, రూరల్ అధ్యక్షులు గ్రానైట్ బాబు, టౌన్ ఉపాధ్యక్షులు పురం నగేష్, రూరల్ ఉపాధ్యక్షులు కుమార్, రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర, జనరల్ సెక్రటరీ రెడ్డెమ్మ, జనరల్ సెక్రటరీ గండికోట లోకేష్, సెక్రటరీ అర్జున, సెక్రటరీ జనార్దన్, స్వాతి, చందు, కేశవ తదితరులు పాల్గొన్నారు.