CSK vs DC: ఉత్కంఠ పోరులో ఢిల్లీ విజయం

ఐపీఎల్ 2020 సీజన్‌లో శనివారం రాత్రి షార్జా వేదికగా ఉత్కంఠంగా సాగిన పోరులో ఢిల్లీ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. చెన్నై సూపర్​ కింగ్స్​పై ఐదు వికెట్లు తేడాతో ఘన విజయం సాధించింది. 180 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఢిల్లీ ఒక్క బంతి మిగిలి ఉండగానే ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి అంబటి రాయుడు (45*; 25 బంతుల్లో, 1×4, 2×6), డుప్లెసిస్‌ (58; 47 బంతుల్లో; 6×4, 2×6) దుమ్ము లేపడంతో.. 179 రన్స్ చేసి .. ఢిల్లీకి చెన్నై 180 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. అయితే ఢిల్లీ ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో విరుచుకుపడడంతో ధోనీ సేన ఓటమి పాలయింది. 6 వికెట్ల తేడాతో డీసీ ఘన విజయం సాధించింది. 19.5 ఓవర్లలోనే 180 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ కుర్రాళ్లు చేధించారు.