చంద్రబాబు, లోకేష్‌పై కేసు నమోదు చేసిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు..

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌లపై శనివారం కేసునమోదైంది. తిరుపతి ఎంపీ స్థానానికి జరుగుతోన్న ఉప ఎన్నికలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గురు మూర్తిపై టీడీపీ అధికారిక ఫేస్‌బుక్‌ ఖాతాలో అనుచిత పోస్ట్ చేశారు.

దీంతో టీడీసీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై ఎస్పీ ఎస్టీ కేసు కట్టాలని వైసీపీ నేతలు ఏపీ డీజీపీని శుక్రవారం కోరారు. చంద్రబాబు, లోకేష్ పై చర్యలు తీసుకోవాలని చేసిన ఫిర్యాదు చేశారు. దీంతో చంద్రబాబు, లోకేష్‌లపై విజయవాడ సైబర్‌ క్రైమ్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ యాక్ట్‌ కింద శనివారం కేసు నమోదు చేశారు. బాపట్ల ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జున, కైలే అనిల్‌కుమార్‌.. డీజీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేయగా. ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన సైబర్‌ క్రైమ్‌ పోలీసులు బాబు, లోకేష్‌లపై కేసు నమోదు చేశారు.