ఇఫ్తార్ విందులో దాచేపల్లి జనసేన

దాచేపల్లి పట్టణంలోని మర్కస్ మసీద్ నందు దాచేపల్లి జనసేన పార్టీ నాయకుల ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగింది. కొంత మంది కులాలు, మతాల మధ్య గొడవలు పెట్టి పబ్బం గడుపుతున్న ఈ రోజుల్లో ఇలా హిందూ సోదరులు ముస్లిం సోదరులకు ఇస్తారు విందు ఏర్పాటు చేయడం చాలా ఆనందదాయకం. భారతదేశం యొక్క గొప్పతనాన్ని చాటి చెబుతూ.. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ సోదరులు అంతా ఒకటే అనే నినాదంతో జనసేన ఎప్పుడూ ముందుంటుందని, ఇలాంటి కార్యక్రమం ద్వారా చాటి చెప్పవచ్చు. మస్జీద్ లో జనసేన పార్టీ మరియు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గురించి దువా చేయడం జరిగింది. ఇంత మంచి కార్యక్రమంను ఏర్పాటు చేసిన జనసేన పార్టీ నాయకులను ముస్లీమ్ పెద్దలు అభినందించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా, నియోజకవర్గం, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.