మితి మీరిన ముఖ్యమంత్రి.. భజన బృందం మంత్రులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల మంత్రులుగా ప్రమాణము చేసిన నాటి నుండి ముఖ్యమంత్రి భజన.. లేకపోతే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై వ్యక్తి గత విమర్శలు చేయడం ఇదే పనిగా వున్నారు కానీ వారి వారి శాఖలకు సంబంధించిన విషయాలు మాత్రం ఎక్కడా మాట్లాడం గాని, వాటి ఆలోచన గాని చేయడం లేదు. జోగి రమేష్ అనే మంత్రి గారు శుక్రవారం జగన్మోహన్ రెడ్డి భజన చేయడం, వారి చదువు సంస్కారం మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారు రాజ్యాంగాన్ని రాస్తున్నారు అని మాట్లాడం ప్రజలలో వారి స్థాయిని తెలియజేస్తుంది. కనీసం రాజ్యాంగ పద్దతి తెలుసుకోకుండా.. మాట్లాడం రాజ్యాంగం రాయడం అనే మాట.. రాసిన వ్యక్తుల స్థాయిని తగ్గిస్తుంది అని వారిని అవమాన పరిస్తున్నామని అనిపించ లేదా అని జనసేన పార్టీ జిల్లా సంయుక్త కార్యదర్శి డేగల దొరస్వామి నాయుడు పత్రికా ముఖంగా ప్రశ్నించారు. మీరు దయచేసి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కారిస్తే అందరూ సంతోషిస్తారని.. ముఖ్యంగా పత్రికా ముఖంగా ఒక విషయం తెలియజేయాలి అది ఈ మధ్య కాలంలో ప్రైమ్ 9, 99 టీవీలలో విశాఖ పట్నంకి చెందిన రాజీవ్ అనే వైసీపీ నాయకుడు డిబేట్ లలో పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత విషయాలపై .. మితి మీరి ఎక్కువగా మాట్లాడటం జరిగింది. చూడు రాజీవ్ నువ్వు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడం నేర్చుకో.. నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు, ఇంకొకసారి ఇలా పవన్ కళ్యాణ్ గారి గురుంచి మాట్లాడితే.. మాటలతో కాదు.. చెప్పులతో సమాధానం చెప్పే పరిస్థితి వస్తుంది. అందుచే కొంచెము మర్యాద పూర్వకంగా మాట్లాడడం నేర్చుకోండి. ఎవరైనా సరే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా విమర్శలతో ఎదుర్కొండి. అంతే కాని.. చేతకాని తనంతో ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేస్తే ఇకనుంచి మాటకు రెండు మాటలు చెపుతాము అని ఈ పత్రిక ముఖంగా డేగల దొరస్వామి నాయుడు తెలియజేశారు.