దళిత బందు వెంటనే అమలు చేయాలి.. జనసేన వినతి పత్రం

బోనకల్ మండలానికి దళిత బంధు వెంటనే అమలు చేయాలని బోనకల్ మండలం జనసేన పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో జనసేన తరఫున బోనకల్ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా బోనకల్ మండల జనసేన పార్టీ మండల అధ్యక్షుడు తాళ్లూరి డేవిడ్ మాట్లాడుతూ.. సమస్యపై అధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని స్థానిక తాసిల్దార్ గారిని కోరటం జరిగింది. అదేవిధంగా పక్క మండల అయినటువంటి చింతకాని మండలానికి దళిత బంధు అమలు అయింది. కావున అదే విధంగా మధిర మండలానికి అమలైంది అదేవిధంగా బోనకల్ మండలం లో అధికంగా దళితులు ఉన్నారు.. కావున దళితులు వారి జీవన ఉపాధికి కొరకు దళిత బంధు అమలు అయితే వారి స్వయంకృషితో వివిధ వ్యాపారాలు పెట్టుకొని వారి కుటుంబాన్ని పోషిస్తూ వారు మనుగడ సాగిస్తారని.. వారి కుటుంబాలకు వెలుగు నింపుతారని.. రాష్ట్ర ప్రభుత్వాన్ని బోనకల్ జనసేన పార్టీ మండల కమిటీ తరఫున కోరుతూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో బోనకల్ మండల కార్యదర్శి అద్దంకి సంతోష్ కుమార్, కార్యకర్తలు సాయి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.