బడి వారి వీధిలో బోరు బాగుచేయించిన దల్లి గోవింద్ రెడ్డి

గాజువాక నియోజకవర్గం, 64 వ వార్డు గంగవరం గ్రామం, బడి వారి వీధి, సిహెచ్ సన్యాసిరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు, చాలా రోజుల నుండి మంచినీళ్లు బోరు మూత పడిందని, 64 వ వార్డు కార్పొరేటర్ దల్లి గోవింద్ రెడ్డికి ఫిర్యాదు చేయగా ఆయన స్పందిస్తూ రెండు రోజుల వ్యవధిలోనే జీవీఎంసీ వారితో మాట్లాడి సిబ్బందిని పంపించి మంచినీళ్లు బోరుకు కావలసిన సామగ్రిని తక్షణమే రప్పించి 24 గంటల్లో మంచినీళ్లు బోరు రిపేరింగ్ చేయించారు. దీనితో ఆ వీధిలో మహిళలు చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ గోవింద రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. గంగవరం గ్రామం జనసేన నాయకులను అభినందించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ జనసేన పార్టీ విశాఖపట్నం జిల్లా మాజీ పార్లమెంట్ అధికార ప్రతినిధి సిహెచ్ ముసలయ్య చేశారు. ఈ కార్యక్రమంలో ఎరిపిల్లి మెగా నూకరాజు, పి నూకరాజు, సిహెచ్ ఆనంద్, కె సురేష్, కె అప్పారావు మరియు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.