పార్వతీపురం జనసేన-టిడిపి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ కు దారేది డిజిటల్ క్యాంపెయిన్

పార్వతీపురం నియోజకవర్గం: గుంతల ఆంధ్ర ప్రదేశ్ కి దారేది అనే కార్యక్రమాన్ని పార్వతీపురం నియోజకవర్గం, పార్వతీపురం మండలంలో వెంకంపేట రోడ్డు రహదారిపై అధ్వానమైన రోడ్ల దుస్థితిని ప్రజలందరికీ అర్థమయ్యే విధంగా డిజిటల్ క్యాంపెనింగ్ రూపంలో తెలియపరచడం కోసం జనసేన తెలుగుదేశం పార్టీలో ఉమ్మడిగా ఈ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించద్డం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జనసేన టీడీపీ సమన్వయ కర్త ఆదడా మోహన్, తెలుగుదేశం పార్టీ ఇంఛార్జి బోనెల విజయ్ చంద్ర, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ఆగురు మణి, పార్వతీపురం సీనియర్ నాయకులు చందక అనిల్, మండల నాయకులు పట్టణ నాయకులు మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.