రాజోలు బాలికోన్నత పాఠశాలలో మహిళా చైతన్య కిరీటం సావిత్రిబాయి పూలే కి నివాళులర్పించిన దార్ల కుమారి లక్ష్మి

తొలితరం మహిళా చైతన్య కిరీటం సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా సోమవారం రాజోలు జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో ఆమెకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజోలు జనసేన ఎంపీటీసీ దార్ల కుమారి లక్ష్మి మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతదేశపు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని ఆమె భారతదేశంలోనే మొట్ట మొదటిసారిగా బాలికలకు పాఠశాల స్థాపించారు అని తెలియజేశారు. అంటరానివారి కోసం తన ఇంటిలోనే ఒక బావి నిర్మించిన మహనీయురాలు ఆవిడ అని కొనియాడారు. అంతేకాకుండా దాదాపు 150 సంవత్సరాల క్రితం ఆవిడ బాల వితంతువులను చేరదీశారు అని రాజోలు గర్ల్స్ హై స్కూల్లో చదువుకుంటున్న విద్యార్థులకు ఈ సందర్భంగా ఆవిడ తెలియజేశారు. సావిత్రిబాయి పూలే లాంటి గొప్పవారి గురించి విద్యార్థులంతా కూడా తెలుసుకోవాలని మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని అక్కడ చదువుకుంటున్న విద్యార్థులో స్ఫూర్తిని నింపారు.