జనంలోకి జనసేన 2వ రోజు

పాలకొండ నియోజకవర్గం, సీతంపేట మండలం నారాయణ గూడ గ్రామంలో పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు కూరంగి నాగేశ్వరరావు (ఎస్.బి.ఐ రిటైర్డ్ మేనేజర్) పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో యువతతో సమావేశం అయ్యి వారిని కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కూరంగి నాగేశ్వరరావు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి గిరిజన యువతపై ప్రత్యేకమైన అభిమానం ఉందని, రానున్న రోజుల్లో జనసేన అధికారంలోకి రాగానే, గిరిజన యువతకు ప్రత్యేకమైన ట్రైబుల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని, కచ్చితంగా గిరిజన యువత కు అందించాల్సిన విద్య ఉపాధి అవకాశాల మీద జనసేనాని దృష్టి సాధించారాని అన్ని విధాల న్యాయం చేకూర్చే దిశగా జనసేన-టిడిపి ప్రభుత్వం అడుగులు వేస్తుందని కూరంగి నాగేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీతంపేట మండల అధ్యక్షులు మండంగి విశ్వనాథం, పాల్గొన్నారు. పాలకొండ మండల జనసేన నాయకులు డొంపాక సాయి కుమార్
మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు.