పులిగడ్డ గ్రామంలో జనంలోకి జనసేన 2వ రోజు

అవనిగడ్డ నియోజకవర్గం: అవనిగడ్డ మండలం, పులిగడ్డ గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ఆధ్వర్యంలో రెండవ రోజు జనంలోకి జనసేన కార్యక్రమం కొనసాగింది. కార్యక్రమంలో భాగంగా త్రాగునీరు, వీది దీపాలు లాంటి సమస్యలను జనసేన నేతల దృష్టికి తీసుకు వచ్చారు. ఆదివారం ఉదయం పంచాయతీ అధికారులు దృష్టికి వెళ్లి, సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని నేతలు హామీ ఇచ్చారు.