జనం కోసం జనసేన వనసంరక్షణ 366వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనం కోసం జనసేన 366వ రోజులో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర ఆద్వర్యంలో మొక్కల పంపిణీ కార్యక్రమం మరియు పార్టీ ఎన్నికల గుర్తు అయిన గాజు గ్లాసుల పంపిణీ కార్యక్రమం గండేపల్లి మండలం, గండేపల్లి గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 900 మొక్కలు మరియు 900 గాజు గ్లాసులు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 111895 మొక్కలు మరియు 13300 గాజు గ్లాసులు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 367వ రోజు శనివారం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గండేపల్లి మండలం గండేపల్లి గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు గండేపల్లి మండలం మల్లేపల్లి, కె. గోపాలపురం, కిర్లంపూడి మండలం, రామచంద్రపురం మరియు తామరాడ గ్రామాలలో పలు కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా పాల్గొని కార్యక్రమం విజయవంతం చేయవలసిందిగా జనసేన తరపున తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన గండేపల్లి మండల అధ్యక్షులు గోన శివరామకృష్ణ, జగ్గంపేట మండల రైతు కమిటీ అధ్యక్షులు సింగం వాసుకి, జగ్గంపేట మండల బీసీ సెల్ అధ్యక్షులు రేచిపూడి వీరబాబు, జగ్గంపేట మండల యువత అధ్యక్షులు మొగిలి గంగాధర్, రామవరం ఎంపీటీసీ దొడ్డ శ్రీను, గండేపల్లి మండల ఉపాధ్యక్షులు సోడసాని కామరాజు, గండేపల్లి మండల కార్యదర్శి పిల్లి రాజు, గండేపల్లి మండల కార్యదర్శి బొట్ల రాజబాబు, కిర్లంపూడి మండల కార్యదర్శి ఎరుబండి పెద్దకాపు, గండేపల్లి మండల సంయుక్త కార్యదర్శి కారుకొండ విజయ్ కుమార్, గండేపల్లి నుండి గ్రామ అధ్యక్షులు నాళం వెంకటరమణ, కొప్పాక నాగేశ్వరరావు, కర్రి సోము, గరిగిపాటి ఉమేష్, బుర్రా వీరేంద్ర, పిల్లి లోవరాజు, దాసరి గంగాధర్, ఆళ్ళ మణికంఠ, కాకర శ్రీధర్, బొర్రంపాలెం నుండి గ్రామ అధ్యక్షులు పోకల అనిల్, పల్లపు శ్రీధర్, గోనేడ నుండి నల్లంశెట్టి చిట్టిబాబు, వల్లపుసెట్టి నాని, బూరుగుపూడి నుండి కోడి గంగాధర్ కు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్రలు కృతజ్ఞతలు తెలిపారు.