జనంలోకి జనసేన 7వ రోజు

మాడుగుల నియోజకవర్గం, జనంలోకి జనసేన 7వ రోజు కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గ యువనాయకులు రాయపురెడ్డి కృష్ణ గురువారం శంకరం పంచాయతీ, శంకరం గ్రామంలో ప్రతి గడపకు తిరిగి మన జనసేన పార్టీ గుర్తు అయిన గాజు గ్లాస్ ఇచ్చి ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు మరియు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకి వివరించి జనసేన పార్టీ వాళ్ళందరికీ అండగా ఉంటుందని చెప్పడం జరిగింది.
ప్రధాన సమస్య

  1. చొక్కాకుల దేముడమ్మ – 63
  2. రాయపురెడ్డి సోంబాబు – 63
    ఈ ఇద్దరు వ్యక్తులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చినప్పటినుండి పెన్షన్ రాలేదని, తమకు పెన్షన్ వచ్చేలాగా చూడమని వారి సమస్యను చెప్పుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి కచ్చితంగా వారి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది.