టాస్ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఢిల్లీ..

ఐపీఎల్ 2020 టోర్నీలో భాగంగా ఈ రోజు 30వ మ్యాచ్ జరుగుతోంది. దుబయ్ వేదికగా రాజస్థాన్ రాయల్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన ఢిల్లీ కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ బ్యాటింగ్‌ ఎంచుకున్నాడు. హర్షల్‌ పటేల్‌ స్థానంలో తుషార్‌ దేశ్‌పాండేను తుది జట్టులోకి తీసుకున్నట్లు అయ్యర్‌ చెప్పాడు. మరోవైపు ఈ మ్యాచ్‌లోనూ స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ ఓపెనర్‌గా వస్తాడని రాజస్థాన్‌ సారథి స్టీవ్‌ స్మిత్‌ వెల్లడించాడు.