చింతలమోరి జనసేన నాయకులతో సమావేశమైన దేవ వరప్రసాద్

జనసేన- తెలుగుదేశం – భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి దేవ వరప్రసాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం చింతలమోరి గ్రామంలో జనసేన పార్టీ నాయకులు మరియు చింతలమోరి గ్రామ సర్పంచ్ రాపాక రమేష్ బాబు అధ్యక్షతన గ్రామ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడిన ఉమ్మడి పార్టీల ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గ్రామంలో గ్రామ ప్రజలు సమస్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా వంటకాలువ ఏర్పాటు చేయాలని, సురక్షిత మంచినీరు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేయాలని, స్మశాన వాటిక పునరుద్దించాలని విన్నవించగా మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తప్పనిసరిగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పార్టీల రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు, తెలుగు యువత, తెలుగు మహిళలు, అభిమానులు అందరూ పాల్గొన్నారు.