కుత్బుల్లాపూర్ అభివృద్ధి బిజెపితోనే సాధ్యం: బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్

  • ప్రచారంలో పాల్గొన్న సినీ నటుడు, బిజెపి ఎంపీ రవి కిషన్

తెలంగాణ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని ణ్ళ్భ్ నగర్, వివేకానంద్ నగర్, శ్రీనివాస్ నగర్, రోడమేస్త్రి నగర్, వల్లభాయ్ పటేల్ నగర్లలో కుత్బుల్లాపూర్ బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్, గోరఖ్ పూర్ పార్లమెంట్ సభ్యులు రవికిషన్ తో కలిసి ఎన్నికల ప్రచారం చేపట్టారు. బీజేపీ ప్రచారానికి పెద్ద ఎత్తున ప్రజలు విచ్చేసి, కూన శ్రీశైలం గౌడ్ కి మద్దతుగా నిలిచారు. పేదలకు ఇండ్లు, రేషన్ కార్డులు పెన్షన్లు ఇండ్ల పట్టాలు ఇప్పించే బాధ్యత తనదని, బస్తీలలో మౌలిక సౌకర్యాలు కల్పిస్తానని కూన శ్రీశైలం గౌడ్ ప్రజలకు భరోసా కలిపించారు. ఈనెల 30 తేదీన జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇంచార్జ్ నందగిరి సతీష్ తో పాటు స్థానిక బిజెపి, జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు.