Vizag: స్టీల్ ప్లాంట్ సభను జయప్రదం చేయాలని బిసి రోడ్డు గేట్ వద్ద కరపత్రాల వితరణ మరియు మైకులో ప్రచారం

ఆర్మీ గోవింద్ ఆధ్వర్యంలో ఉక్కు పరిరక్షణ సమితి సభకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విచ్చేస్తున్న సందర్భంగా స్టీల్ ప్లాంట్ బిసి రోడ్డు గేట్ వద్ద ఈరోజు ఉదయం జనరల్ డ్యూటీ కార్మికులకు పాంప్లెట్ పంచి, మైక్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది. ఈ సభకు ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉక్కు నాయకులు సోమన్న, పితన భాస్కర్, జగన్నాథ్ రమణగారు, గొంత్తిన జగదీష్, సాడే రామారావు, బోండా చిన్న అప్పరావు, సీతిని శ్రీనివాస్, వీసం శివప్రసాద్, జనసైనికులు జగన్నాథ్, శ్రీను, యోగి, ములంపక కృష్ణ, కోన సురేష్ తదితరులు పాల్గొన్నారు.