కరప గ్రామంలో క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

కాకినాడ రూరల్ నియోజకవర్గం: దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ రాజకీయ పార్టీ కార్యకర్తలకు కల్పించలేని భరోసా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రతి జనసైనికులకు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నారని పిఎసి సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ పేర్కొన్నారు.. కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప గ్రామంలో క్రియా శీలక వాలంటీర్ గా 535 జనసేన సభ్యత్వాలు చేయించిన ముద్రగడ రమేష్ కు అభినందనలు తెలిపారు. గ్రామ అధ్యక్షులు పేకెటి ప్రసాద్ ఆధ్వర్యంలో జనసైనికులకు క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్క జనసైనికులు కృషి చేయాలని కోరారు. పార్టీ సభ్యత్వం తీసుకున్న ప్రతి వాలంటీరు ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలన్నారు. సభ్యత్వం కలిగిన జనసైనికులకు ప్రమాదం సంభవిస్తే బీమా సదుపాయం వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు, జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, వీరమహిళలు, జనసైనికులు పాల్గొన్నారు.