రాజోలులో రెండవ రోజు క్రియాశీల సభ్యత్వ కిట్ల పంపిణీ

రాజోలు, జనసేన పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి జనసేన క్రియాశీల సభ్యత్వ కిట్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం రాజోలు నియోజకవర్గంలో రెండవ రోజు సఖినేటిపల్లి మండలంలో సఖినేటపల్లి లంక, సఖినేటిపల్లి, అంతర్వేదిపాలెం, టేకిశెట్టిపాలెం గ్రామాలలో మండల అధ్యక్షులు గుబ్బల ఫణి కుమార్ అధ్యక్షతన జనసైనికులకు క్రియాశీల సభ్యత్వ కిట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సంయుక్త కార్యదర్శలు దిరిశాల బాలాజీ, తాడి మోహన్ కూమార్ జిల్లా సంయుక్త కార్యదర్శులు గుండాబత్తుల తాతాజీ, గుబ్బల రవికిరణ్, మత్స్యకార విభాగం పొన్నాల ప్రభ, ఎంపీపీ మేడిచర్ల సత్యవాణి రాము, మల్కిపురం మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు, రాజోలు మండల అద్యక్షులు సూరిశెట్టి శ్రీను, జనసేన నాయకులు గుండుబొగుల పెద్దాకాపు, గెడ్డం మహాలక్ష్మి ప్రసాద్, డాక్టర్ రాపాక రమేష్ బాబు, లింగోలు చిన్నబ్బులు, అల్లూరి రంగ రాజు, రావూరి నాగు, మేడిచర్ల రాము, రావి మురళి, నామన నాగభూషణం ఉండపల్లి అంజి, మండేల బాబీనాయుడు, నాయుడు కృష్ణబాబీ, కుసుమ నాని, సాధనాల విజయ్, ముచ్చర్ల వెంకటేష్ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.