జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ పంపిణీ

శ్రీకాకుళం: చల్లపేట శ్రీ సంతోషి మాత కళ్యాణమండపంలో నియోజకవర్గ నాయకులు పనుతుల జయరామ్ ఆధ్వర్యంలో మంగళవారం క్రియాశీలక వాలంటీర్లకు మరియు జనసైనికులకు కిట్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జయరామ్ మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఎన్నడు లేని విధంగా క్రియాశీలక సభ్యత్వ నమోదు ద్వారా కార్యకర్తలకు ఐదు లక్షల ప్రమాద బీమా కల్పించి, తద్వారా వారి కుటుంబాలకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అండగా ఉన్నారని తెలియపరచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు సారవకోట జలుమురు నరసన్నపేట, పోలకి మండల నాయకులు సంతోష్, కిరణ్ శ్రీను, ధనుంజయ, చిరంజీవి మోషి, సురేష్, చందు, మరియు మండల జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.