స్వామి వివేకానంద జయంతి సందర్భంగా పేదలకు దుప్పట్ల పంపిణీ

రాజంపేట, స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకుని జనసేనపార్టీ ఆధ్వర్యంలో కడపజిల్లా, రాజంపేట నియోజకవర్గ పరిధిలోని T సుండుపల్లి మండలం, పెద్దబలిజపల్లి గ్రామ పరిధిలో ఉన్న సామిసెనిగడ్డ హరిజనవాడలల్లో దుప్పట్లు పంపిణీ చేపట్టిన రామశ్రీనివాసులు. ఆయన మాట్లాడుతూ యువతకు స్ఫూర్తి ప్రదాత, మార్గదర్శి, భారతదేశ ఔన్నత్నాన్ని ప్రపంచ దశదిశలా చాటిన చైతన్య మూర్తి శ్రీ స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలందరికీ జాతీయ యువజన దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ 2022వ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ సందర్భంగా నిరుపేదలకు చిరు సహాయంగా ఈ కార్యక్రమం చేపట్టడం నాకు ఆనందంగా ఉంది అని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.