జనసేనాని జన్మదినాన విద్యార్ధులకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ

రాజంపేట: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ప్రియతమ నాయకుడు జనసేన అధ్యక్షుడు కొణిదల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ సూచించిన 5 సూచనల సేవా కార్యక్రమాలలో ఒకటైన ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో బాలికలు, బాలురకు పుస్తకాలు, పెన్నుల పంపిణీ కార్యక్రమం సిద్ధవటం మండలం జనసేన పార్టీ ఇంచార్జ్ కొట్టే వెంకట రాజేష్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో క్రియాశీలక సభ్యులు, జనసేన వార్డు మెంబర్ పసుపులేటి కళ్యాణ్, సుహేల్, కరీముల్లా, శ్రీనివాసులు, రెడ్డి పవన్, సిద్ధవటం మండలం జనసైనికులు పాల్గొన్నారు.