శివరాత్రి రధోత్సవం సందర్భంగా భక్తులకి మజ్జిగ పంపిణీ

శ్రీకాళహస్తి, జనసేన పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా ఆదేశాల మేరకు ఆదివారం శివరాత్రి రధోత్సవం సందర్భంగా పార్టీ నాయకులు పట్టణంలోని నాలుగు మాడ వీధుల్లో 1000 మంది భక్తులకి మజ్జిగ పంపిణీ కార్యక్రమం నిర్వహించి ఎండ తీవ్రతలో శివయ్య దర్శనానికి విచ్చేసిన భక్తుల దాహార్తిని తీర్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు తోట గణేష్, ఐటీ కోఆర్డినేటర్ కావలి శివకుమార్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు పేట చంద్ర శేఖర్, నాయకులు రవి కుమార్ రెడ్డి, జ్యోతి రామ్, పేట చిరంజీవి, హేమంత్ గౌడ్, సురేష్, రాజేష్, వెంకటరమణ యాదవ్, గరిక సురేష్, ప్రమోద్, గిరీష్ తదితరులు పాల్గొన్నారు.