జనసేన వనరక్షణలో కొబ్బరి మొక్కల పంపిణీ

  • జనం కోసం జనసేన 574వ రోజు

జగ్గంపేట నియోజకవర్గం: జనసేన నాయకులు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర జగ్గంపేట నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనం కోసం జనసేన 574వ రోజు కార్యక్రమంలో భాగంగా జనసేన వనరక్షణ ద్వారా ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కల పంపిణీ కార్యక్రమం బుధవారం గోకవరం మండలం ఆర్&ఆర్ కాలనీ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 350 కొబ్బరి మొక్కలు పంచడం జరిగింది. నేటి వరకు నియోజకవర్గం మొత్తంగా 5000 కొబ్బరి మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. జనం కోసం జనసేన 574వ రోజు కార్యక్రమం ఘురువారం కిర్లంపూడి మండలం, ముక్కొల్లు గ్రామంలో కొనసాగించడం జరుగుతుంది. కావున అందుబాటులో ఉన్న జనసైనికులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. బుధవారం కార్యక్రమాన్ని విజయవంతం చేసిన దేవిపట్నం మండల అధ్యక్షులు చారపు వెంకట రాయుడు, జగ్గంపేట మండల అధ్యక్షులు మరిశే రామకృష్ణ, గోకవరం మండల సంయుక్త కార్యదర్శి కరిబండి సాయి పవన్, ఆర్&ఆర్ కాలనీ నుండి గ్రామ అధ్యక్షులు తైలం రమేష్, గ్రామ యువత అధ్యక్షులు చామకూరీ కిషోర్, చాండ్ర రవిచంద్ర, కరిమిరెడ్డి మధు, తిరుమలశెట్టి సత్య జశ్వంత్, కరిమిరెడ్డి నాగ ఫణీంద్ర, కొడవటి దుర్గాప్రసాద్ రెడ్డి, కాట్రాజుల వినయ్, కేతా లక్ష్మణరావు, గోనేడ నుండి నల్లంసెట్టి చిట్టిబాబు, వల్లపుశెట్టి లకు పాటంశెట్టి శ్రీదేవిసూర్యచంద్ర కృతజ్ఞతలు తెలిపారు.