టీం జనసేన వై కోట ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ

రైల్వే కోడూరు: పవన్ కళ్యాణ్ ఆలోచన, సిద్ధాంతాల మేరకు వై కోటలోని హరిజనవాడలో చేపల శివాజీ అనే వ్యక్తి ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ కి గురి కావడం జరిగింది. దాదాపుగా ఏడాది క్రితం నుంచి ఇంటి నుండి బయటకు వెళ్లడానికి వీలు లేకుండా మంచానికి పరిమితమై ఉన్నారు. హరిజనవాడలో ఉన్నటువంటి మన జన సైనికుల సమాచారం మేరకు చేపల శివాజీ అనే వ్యక్తికి ఒక నెలకు సరిపడా నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం చేయాలని టీం జనసేన వై కోట సభ్యులు కలిసి శివాజీ కుటుంబానికి ఒక నెలకు సరిపడా నిత్యవసరసరుకులు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహాయపడిన కొండేటి మనోజ్, నల్లంశెట్టి నాగరాజు, అంకిపల్లి హరికృష్ణ, మల్లెం అజయ్, అడపాల మల్లికార్జున తో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాగిపోక పెంచలయ్య, హరికృష్ణ, రూతేష్, యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.