జె.ఎస్.పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ

గుంటూరు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా గుంటూరు అమరావతి రోడ్డులోని జ్వరాల ఆసుపత్రిలో పేషెంట్లకు జె.ఎస్.పి రాయల్ సోల్జర్స్ ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ కార్యక్రమం మరియు రెడ్డిపాలెంలోని మానవతా సేవా సమితి వృద్ధుల ఆశ్రమంలో భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జె.ఎస్.పి రాయల్ సోల్జర్స్ అధ్యక్షులు అన్నదాసు వెంకట సుబ్బారావు, నగర ప్రధాన కార్యదర్శి సూరిశెట్టి ఉపేంద్ర, జనసేన మీడియా కోఆర్డినేటర్ పుల్లంశెట్టి ఉదయ్, నగర కార్యదర్శిలు తోట కార్తీక్, బండారు రవీంద్ర కుమార్, రూరల్ మండల అధ్యక్షుడు గంధం సురేష్, జనసైనికులు మెండు హరి, మిద్దె నాగరాజు, పసుపులేటి గోపి, పసుపులేటి అయ్యప్ప పాల్గొని జనసేనానికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.