సత్తెనపల్లిలో జనసేన క్రియాశీలక సభ్యత్వ కిట్ల పంపిణీ

సత్తెనపల్లి నియోజవర్గం: సత్తెనపల్లి పట్టణంలో 22వ వార్డు నాగన్న గుంటలో రాడ్లు శీను ఆధ్వర్యంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులకు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ యాదవ్ క్రియాశీలక కిట్లను పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల మీద ఇష్టంతో అన్ని పార్టీలు మాదిరిగా కాకుండా పార్టీ కార్యకర్తలకు ఒక భరోసా అవ్వాలని ఉద్దేశంతో వినూత్నంగా ఆలోచించి కార్యకర్తలు శ్రేయస్సు కోసం 5 లక్షల రూపాయలు బీమాతో సభ్యత నమోదు కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది తెలియజేశారు. రానున్న రోజుల్లో ఈ నాగన్న గుంట సమస్యల మీద మీ అందరికీ మేము అండగా ఉంటాము న్యాయం చేస్తామని తాగునీటి సమస్యను ఇల్లా పట్టాల సమస్యను పరిష్కారం దిశగా అడుగులు వేస్తామని తెలియజేశారు. అనంతరం సభ్యత నమోదు చేసుకున్న సభ్యులందరికీ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా సంయుక్త కార్యదర్శి సిరిగిరి శ్రీనివాసరావు, తిరుమల శెట్టి మల్లేశ్వరి, రాజుపాలెం మండల ఉపాధ్యక్షులు పసుపులేటి వెంకటస్వామి, అంచుల అనేష్ కుమార్, నకరికల్లు ఉపాధ్యక్షులు బత్తిన శ్రీనివాసరావు, దమ్మాలపాడు ఎంపీటీసీ సిరిగిరి రామారావు, శిరిగిరి మణికంఠ, గాంధీ సదాశివరావు తదితరులు పాల్గొన్నారు.