ఘనంగా ముగిసిన జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ…

పిఠాపురం: జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్ల పంపిణీ కార్యక్రమం మూడవ రోజు పిఠాపురంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ఇంచార్జి శేషుకుమారి, జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు, జిల్లా నాయకులు, జనసైనికులు మరియు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్చార్జి శేషు కుమారి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త గ్రామస్థాయిలో నుంచే బలోపేతం చేయాలని సూచించారు. అనంతరం జనసేన నాయకులు కడారి తమ్మయ్య నాయుడు మాట్లాడుతూ… ఈ మూడు రోజుల కార్ర్యక్రమాలు విజయవంతం చేసినందుకు జనసైనికులకు కృతజ్ఞతాభినందనలు తెలియజేసారు. అలాగే ప్రభుత్వం జనసేనపై ఎంత కక్ష సాధింపు చర్యలు చేసినా.. ఎదురు నిలిచి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ముఖ్యమంత్రిని చేసి తీరుతామని తెలిపారు. అనంతరం జనసేన నాయకులంతా కలిసి పార్టీ క్రియాశీలక సభ్యత్వం పొందిన ప్రతి ఒక్కరికి ప్రశంసాపత్రంతో కూడిన కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసైనికులు పాల్గొన్నారు.