రేషన్ ద్వారా రాయితీపై నిత్యావసర వస్తువులు అందించి పేదలపై భారం తగ్గించే ఆలోచన ప్రభుత్వానికి ఉందా లేదా..?

గత ప్రభుత్వంలో రేషన్ దుకాణాల ద్వారా కుటుంబ సభ్యులకి ఐదు కిలోల చొప్పున బియ్యం, కార్డుకు రెండు కిలోల కందిపప్పు, అరకిలో చక్కెర, కిలో గోధుమపిండి, కిలో ఉప్పు ఇచ్చేవారు బియ్యం వద్దు అనుకొనే వారికి బదులుగా చిత్తూరు అనంతపురం జిల్లాలో రాగులు, కర్నూలు కడప కృష్ణా జిల్లాల్లో జొన్నలు పంపిణీ చేసేవారు.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక కుటుంబ సభ్యులకు 5 కిలోల బియ్యం కార్డులకు అరకిలో చక్కెర ఇస్తున్నారు. నెలకు 2 కిలోలు ఇచ్చే కందిపప్పు కిలో చేశారు. కందిపప్పు పై 68% శాతం, పంచదార పై 70% శాతం చొప్పున ధరలు పెంచారు… అది కార్డు దారుల అందరికీ ఇవ్వడం లేదు గోధుమ పిండి రాగులు జొన్నలు తీసేశారు.

వంటనూనెల ధరలు వాటి ఆలోచన కొరవడింది. వంటనూనెలను పంపిణీ చెయ్యడం ఎప్పుడో ఆపేసారు. ప్రజా సంకల్ప యాత్రలో జగన్ మోహన్ రెడ్డి ప్రజలను ఆదుకుంటామని చెప్పిన వాగ్దానాలు ఇప్పుడు ఏమయ్యాయి.. పెరుగుతున్న ధరలను కచ్చితంగా తగ్గించాలి. రేషన్ ద్వారా నిత్యావసర వస్తువులు అందించి పేద వారిని ఆదుకోవాలని జనసేన పార్టీ తరపున చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత డిమాండ్ చేశారు.