దుర్గాదేవి కమిటీలకు బియ్యం, నూనె డబ్బాలు పంపిణీ చేసిన డాక్టర్ కందుల

విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఘనంగా నిర్వహిస్తున్న దేవీ నవరాత్రులు ఉత్సవాలు సందర్భంగా ఏర్పాటు చేయనున్న అన్న సంతర్పణ కార్యక్రమానికి వివిధ దేవి నవరాత్రులు కమిటీల నిర్వాహకులకు దక్షిణ నియోజకవర్గ జనసేన నాయకులు, 32 వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందుల నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి నియోజకవర్గంలో చాలా చోట్ల దుర్గా దేవి సంబరాలు నిర్వహించారని చెప్పారు.
చాలా దుర్గాదేవి పందిళ్లకు తన కుటుంబ సమేతంగా వెళ్లి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని కూడా చెప్పారు. ఆ అమ్మవారి ఆశీస్సులు నియోజవర్గ ప్రజలందరికీ ఉండాలని అలాగే అందరూ సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నట్లు తెలియజేశారు. వివిధ దుర్గాదేవి కమిటీలు భక్తుల కోసం నిర్వహించే అన్న సంతర్పణ కార్యక్రమాలకు బియ్యం బస్తాలు ఆయిల్ డబ్బాలను పంపిణీ చేయడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.